న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని చలి మంచు కప్పేసింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు వల్ల నగరమంతా మసకమసకగా మారింది. ఇండియా గేట్ వద్ద మంచు దట్టంగా ఉంది. రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మొత్తం 11 రైళ్లు లేట్గా నడుస్తున్నట్లు సమాచారం. ఢిల్లీకి చేరుకునే సుమారు 9 రైళ్లను రద్దు చేశారు.