సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నేడు నిర్వహించే శ్రీమల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ మండపంలో ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామివారి కల్యాణాన్ని శ్రీమత్ జగద్గురు 1008 వీరశైవ పీఠాధిపతుల ఆధ్వర్యంలో వీర శైవ ఆగమ పండితులచే నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభు త్వం తరఫున భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వామి వారికి పట్టువస్ర్తాలను సమర్పిస్తారు. ఈ వేడుకకు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, శాసనమండలి విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జాతర నిర్వహించనున్నారు.