చెన్నై మెరీనా బీచ్ సమీపంలో తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం దీక్ష ప్రారంభించారు. జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అయన దీక్ష ప్రారంభించారు. పన్నీర్ దీక్షకు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు దీక్షలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పన్నీర్ సెల్వం మద్దతుదారు ప్రజలు దీక్ష ప్రాంగణానికి చెరుకున్నారు. జయలలిత మృతిపై అనుమానాల నేపథ్యంలో అమ్మ చికిత్సపై గత నెల అపోలో వివరణ ఇచ్చింది. కాగా రెండు రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. అయితే, వారు ఇచ్చిన సమాధానాలు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జయలలిత మరణంపై సీబీఐతో విచారణ జరిపించడానికి ఆదేశాలు వచ్చే వరకు తాము దీక్షను విరమించబోమని పన్నీర్ సెల్వం అన్నారు.