శరీరాన్ని చల్లగా ఉండే ఏసీ జాకెట్ మార్కెట్లోకి వచ్చేసింది. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ వీటిని ఆవిష్కరించారు. స్వీయ శీతలీకరణ విధానంలో రూపొందించిన ఈ జాకెట్లలో చల్లగా కావాలంటే చల్లగా, వెచ్చగా కావాలంటే వెచ్చగా రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. బయటి ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జాకెట్లు 20 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చల్లగా ఉంచగలవని మంత్రి పేర్కొన్నారు. ఖన్వా కాటన్ కు, అత్యాధునిక సాంకేతికను మేళవించి వీటిని తయారు చేసినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంచే రెండు బటన్ లు ఉంటాయి. వేడి కోసం ఎర్రటి బటన్, చల్లదనం కోసం ఆకుపచ్చ బటన్ నొక్కితే సరిపోతుంది. ఈ జాకెట్ లో బ్యాటరీతో నడిచే కూల్, హాట్ ఎయిర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు.క్లైమేట్ గేర్ టెక్నాలజీని రూపొందిచడం ద్వారా ఓ ఎంఐటీ గ్రాడ్యుయేట్ దీని తయారీలో సహకరించాడు. త్వరలోనే ఈ జాకెట్లు మార్కెట్లోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. ఫుల్ స్లీవ్ జాకెట్ రూ. 25 వేలుగా ఉండగా, హాఫ్ జాకెట్ రూ. 18 వేల వరకూ ఉంటుందని సమాచారం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జాకెట్ తయారీకి సహకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa