దేశరాజధాని ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తూ మార్గమధ్యంలో మంటలు అంటుకుని మేదాంత ఆసుపత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ థాయ్లాండ్ వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో పైలట్ అరుణాక్షానంది చనిపోయారు. మిగతా క్షతగాత్రులను ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా బ్యాంకాక్ తరలిస్తున్నామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.