ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ నిబంధనలతో ేకబినెట్‌ హోదా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2017, 12:55 PM

హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి: రాజకీయనేతలకు పద వులు పందారంలో సర్కార్‌కు చుక్కెదురు అవుతూనే ఉంది. రాజకీయ నేతలను పదవుల్లో నియమించడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి ప్రభుత్వం మరో మారు చిక్కుల్లో పడ నుంది. గతంలో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు పార్లమెంట్‌ సెక్రెటరీలుగా నియమించడంపై హైకోర్టులో కేసు వేయడంతో రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు తెలపడంతో ఉన్న ఫలంగా పార్లమెంట్‌ సెక్రెటరీల పదవులు పోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పలువురిని సలహాదారులుగా, వివిధ ప్రభుత్వ సంస్థల చైర్మన్లుగా నియమించడంతో పాటు కొందరికి కేబినెట్‌ హోదా కల్పించడం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ప్రభుత్వ సలహాదారులతో పాటు వివిధ హోదాల్లో ఉన్న పలువురికి కేబి నెట్‌ హోదా ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారని తెలంగాణ ప్రభు త్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వేతనాలు, ఇతర సదుపాయాలు ఏ చట్టం ప్రకారం కల్పిస్తున్నారని అడిగింది. బాలకిషన్‌, ఆర్‌.విద్యా సాగర్‌ రావు, ఏకేగోయెల్‌, ఎ.రామలక్ష్మణ్‌, బీవీ పాపారావు, కేవీ రమణాచారి, జీఆర్‌ రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్‌, పేర్వారం రాములు, కేఎం సహానీ, ఎస్‌.వేణుగోపాల చారి, రామచందడు తేజావత్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎస్‌. సత్యనారాయణ, పిడ మర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ లకు కేబినెట్‌ హోదా ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌.. పరిమితికి మించి ఎక్కువమందికి కేబినెట్‌ హోదా కల్పించారని హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తనకు నచ్చిన వారికి కేబినెట్‌ హోదా కట్టబెట్టుతోందని రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, ఓ నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఉన్నందున... రాజ్యాంగం ప్రకారం 15శాతం మందికే కేబినెట్‌ హోదా కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు లేవని.. కొన్నేళ్లుగా సంప్రదాయంగా వస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. వీరు కేవలం సలహాలు మాత్రమే ఇస్తారని.. కేవలం రాజకీయ నాయకులే కాకుండా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారని వివరించారు. కేబినెట్‌కు సంబంధం లేదని.. కేబినెట్‌ మంత్రికి ఇచ్చే సదుపాయాలను ప్రభుత్వం ఇస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యాజ్యాన్ని పూర్తి స్థాయి విచారణకు స్వీకరించిన హైకోర్టు... కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కేబినెట్‌ హోదాలో ఉన్న ప్రభుత్వ సలహాదారులు, ఇతరులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com