ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేనేత జీవితాల్లో వెలుగులు: కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2017, 12:58 PM

హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి:  చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమం రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో హ్యాండ్లూమ్‌, పవర్‌లూమ్‌ కార్మి కుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం మంగళవారంనాడు ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, డైరెక్టర్‌శైలజా రామయ్యర్‌, సలహాదారు హెచ్‌.కె.చారి, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీడీ రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  చేనేత కార్మికుల బతుకులు చాలా దీనంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నేత వౄఎత్తిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చేనేత కార్మికులు ఒకప్పుడు పెద్దఎత్తున ఈ వృత్తిని నమ్ముకుని జీవించేవారని.. కాలక్రమంలో చేనేత వస్త్రాల వాడకం తగ్గడంతో వారి బతుకులు కూడా చితికి పోయాయన్నారు. నమ్ముకున్న కుల వౄఎత్తి కడుపునిండా అన్నం పెట్టడం లేదు. చాలా మంది చేనేత వృత్తి వదులుకున్నారు. మరో పనిచేయలేక జీవితం చాలించారని తెలిపారు. చాలా మంది కార్మికులు పవర్‌లూమ్‌ కార్ఖానాల్లో దినసరి కూలీలుగా జీవితం వెల్లదీస్తున్నారని పేర్కొ న్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమం రూపొందిం చాలని సీఎం సూచించారు.  చేనేతకారుల వస్తువులకు మార్కెటింగ్‌ కల్పించా లన్న సీఎం వారికి మొదటగా ప్రభుత్వం తరపునే ఆర్డర్లు ఇవ్వాలన్నారు. స్కూల్‌ పిల్లల యూనిఫారాలు, ఆస్పత్రులు, హాస్టళ్లలో చద్దర్లు, పండుగలప్పుడు ప్రభుత్వం తరపున పేదలకు పంచే దుస్తులు, పోలీస్‌ యూనిఫారాలు తదితర ఆర్డర్లన్నీ చేనేత కార్మికులకు ఇవ్వాలన్నారు. పవర్‌లూమ్‌లకు కూడా కావాల్సినంత సాయం అందివడంతో పాటు పనివ్వాలని తెలిపారు. ముడి నూలను సబ్సిడీపై అందించాలి. ఇప్పటికే నేసి ఉన్న స్టాక్‌ను కొనుగోలు చేయాలని చెప్పారు. చేనేత వృత్తిని వదులుకొని ప్రత్యామ్నాయ ఉపాధి చూసు కుందామనుకునే వారికి కూడా చేయూతనివ్వాలి. అందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమం సమగ్రంగా ఉండాలని సూచించారు.


జీవించే భరోసా కల్పించాలి : ప్రభుత్వం తమను బతికిస్తుందనే నమ్మకం నేతన్నలలో కలగాలని సీఎం అన్నారు. నేత వౄఎత్తిని నమ్ముకుని జీవించే వారికి భరోసా ఇవ్వడానికి.. వారిని ఆదుకోవడానికి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కూలీలుగా పనిచేస్తున్న కార్మికులకు మేలు చేసేలా సాయం ఉండాల న్నారు. ఇందుకోసం విధానం రూపొందించాలని పేర్కొన్నారు.  చేనేత కళ తెలంగాణకు ప్రత్యేకం కాబట్టి దాన్ని కాపాడుకో వాలన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో సిద్ధిపేట గొల్లబామ చీరలను ప్రత్యేకంగా అమ్మేవారని సీఎం గుర్తుచేశారు. అలాంటి ప్రత్యేకతలున్న వస్త్రాలకు పూర్వ వైభవం రావాలని అన్నారు. నారాయణపేట, గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో కళాత్మకమైన పట్టు వస్త్రాలు నేస్తారు. ఈ వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉంటది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com