ఖమ్మం:శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో డీజీపీ పర్యటించారు. కమాండ్ కంట్రోల్, జిల్లా పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో శాంతిభద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పోలీస్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. త్వరలో ఖమ్మంలో ట్రాఫిక్, సీసీటీవీ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. అనంతరం డీజీపీని ఖమ్మం ఎమ్మెల్యే అజయ్కుమార్ కలిశారు. రఘునాథపాలెం పోలీస్స్టేషన్ను ఎస్హెచ్వోగా మార్చాలని ఖమ్మం ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.