లోక్ సభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు సమర్ధనీయమే కానీ ఆ తర్వాత క్రిమినల్ చర్యలు ఉండకూడదు అని ఆయన అన్నారు. అలాగే ముస్లింల్లో 68 శాతం మంది ఈ బిల్లును సమర్ధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కాగా రాజమండ్రిలోని మసీదు మౌజం హత్యపై డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించానని తెలిపారు.