లక్నో : యూపీ రాజధాని లక్నోలోని హజ్ హౌస్ కార్యాలయం ప్రహరీ గోడకు కాషాయం రంగు వేయడంపై తీవ్ర వివాదం రేగడంతో దెబ్బకు రంగు మార్చేశారు. ఒక్క రోజు లోనే కాషాయ రంగును కడిషేసి గోడకు పాత రంగు వేశారు. ప్రహరి గోడకు కాషాయ రంగు రాత్రికి రాత్రి తీసేశారు. అంతే కాదు ప్రహారిగోడకు కాషాయ రంగు వేయడం కాంట్రాక్టర్ తప్పిదమని నెపం ఆ కాంట్రాక్టర్ పై నెట్టివేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.