హైదరాబాద్: ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే వరంగల్, ఖమ్మంలో ఐటీ హబ్ భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో భాగంగా కరీంనగర్లో నిర్మించ తలపెట్టిన ఐటీ సెంటర్కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇదే వరుసలో నిజామాబాద్, మహబూబ్నగర్ పట్టణాలు కూడా అతి తర్వలోనే చేరనున్నాయి.