సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో అటార్నీ జనరల్ వేణుగోపాల్ భేటీ అయ్యారు. జస్టిస్ చలమేశ్వర్ సహా నలుగురు సుప్రీం కోర్టు న్యాయవాదులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుప్రీం కోర్టు పాలనా వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇలా విలేకరుల సమావేశంలో మాట్లాడటం ఇదే మొదటి సారి.ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ సుప్రీం కోర్టు న్యాయమూర్తితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కొద్ది సేపటిలో సీజేఐ అటార్నీ జనరల్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు.