ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికలను కిడ్నాప్ చేసిన యువకుల అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 02:40 PM

మెదక్ : ప్రేమిస్తున్నాని మాయ మాటలు చెప్పి బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు యవుకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మెదక్ డీ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు... మెదక్ పట్టణానికి చెందిన మోహిన్‌కాన్ పట్టణానికే చెందిన బాలికను గత నెల 16వ తేదీన కిడ్నాప్ చేశాడు. అతనికి సహకరించిన తాహెర్, ఇంతియాజ్, మహమ్మద్ ఎనేజార్‌లపై బాలిక తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెదక్ కొత్త బస్టాండ్‌లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్‌కాన్ పరారీలో ఉన్నాడు. పాపన్నపేట మండల ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో హవేళిఘణపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బెండ ప్రణయ్‌గౌడ్, అలియాస్ రాజాగౌడ్‌ను సైతం అరెస్టు చేసినట్లు డీ ఎస్పీ వివరించారు. వీరిపై కిడ్నాప్ అండ్ రేప్ కేసుల నిమిత్తం 366, 376, 109, ఐపీసీ సెక్షన్5(1), 6 అండ్ 17, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ముందు వారిని ప్రవేశపెట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com