ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌తో సమావేశమైన టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 07:41 PM

హైదరాబాద్: బడ్జెట్‌లో లక్షల కోట్లు పెరుగుతున్నాయి కానీ, పూర్తిగా ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ను టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్‌రెడ్డితోపాటు పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎల్. రమణ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌ కాపీలను గవర్నర్ కు అందజేశామన్నారు. బడ్జెట్‌ను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఖర్చు చేయడంలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను సీఎం నట్టేట ముంచుతున్నారని అన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com