హైదరాబాద్: బడ్జెట్లో లక్షల కోట్లు పెరుగుతున్నాయి కానీ, పూర్తిగా ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. గురువారం రాజ్భవన్లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ను టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్రెడ్డితోపాటు పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎల్. రమణ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ కాపీలను గవర్నర్ కు అందజేశామన్నారు. బడ్జెట్ను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఖర్చు చేయడంలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను సీఎం నట్టేట ముంచుతున్నారని అన్నారు.