ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో టీచర్స్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ రద్దు

Telangana Telugu |   | Published : Thu, Mar 09, 2017, 06:25 PM

హైదరాబాద్‌: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదారబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ను ఈసీ రద్దు చేసింది. తిరిగి ఈ నెల 19న రీ పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లో ఫోటోలు తారుమారయ్యాయి. మూడో నంబర్లో ఉన్న టీఎస్‌ యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి, తొమ్మిదో నెంబర్లో ఉన్న స్వతంత్ర అభ్యర్థి లక్ష్మయ్య ఫొటోలు తారుమారయ్యాయి. దీన్ని గుర్తించిన మాణిక్‌రెడ్డి పోలింగ్‌ రద్దు చేయాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై భన్వర్‌లాల్‌ స్పందిస్తూ బ్యాలెట్‌ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం నిజమేనని ఈసీకి నివేదిక పంపారు. దీంతో పోలింగ్‌ రద్దు చేసిన ఈనెల 19న రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com