పెద్దపల్లి: సింగరేణి భూములతో ఇళ్లు నిర్మించుకున్న ప్రజలకు ఈ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రెవెన్యూశాఖ అధికారులు, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిట్టూరి రాజమని, డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పోరేటర్లు పాల్గొన్నారు.