మహబూబ్ నగర్ ఓట్ల కోసం నోట్లిచ్చే నేతల్ని చూస్తున్నాం. అక్కడక్కడా నోట్లిస్తే ఓట్లేస్తామనే వాళ్ళనీ చూస్తుంటాం. కానీ వీటికి విరుద్ధంగా ఓట్లు వేస్తాం. ఇదిగో మీ ప్రచార ఖర్చుల కోసం నోట్లూ ఇస్తాం అనే వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం. ఇలాంటి ఘటనే ఒకటి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్లో జరిగింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తన ప్రచారంలో భాగంగా ఆదివారం రాజాపూర్కి వెళ్ళారు.అక్కడ భారీ ఎత్తున వాల్మీకి, రజక సంఘాల నేతలు, సభ్యులు టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారిలో నుంచి రాజాపూర్కి చెందిన పాల్కొండ వెంకటయ్య, కురుగుల రాములు మంత్రి కూర్చున్న వేదిక వద్దకు వచ్చారు. తమ వద్దనున్న రెండు వేల రూపాయలను మంత్రి చేతుల్లో పెట్టారు.