హైదరాబాద్ : కొండాదంపతులు అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని తెరాస నాయకురాలు గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… కొండాదంపతులు అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని, బీసీ కులంలో పుట్టి దొరతనం చేస్తున్న చరిత్ర కొండా దంపతులదన్నారు. తెలంగాణకు వ్యతిరేకమైన బీసీ మహిళ కాబట్టే ఆనాడు కొండా సురేఖకు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని, కేసీఆర్ కుటంబం గురించి మాట్లాడే అర్హత కొండా సురేఖకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన చరిత్ర సీఎం కేసీఆర్ కుటుంబానిదని, ఉద్యమ కారులపై కాల్పులు జరిపిన చరిత్ర కొండా సురేఖదని అన్నారు.