ఇప్పటి వరకు 46 కిలోమీటర్ల ట్రాక్ పరిధిలో 8 ఆర్వోబీఎస్లు నిర్మించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. కొన్ని చోట్ల 60 నుంచి 70 అడుగుల ఎత్తున ట్రాక్ వేయాల్సి వచ్చింది. సాధారణ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేశామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 5వేల మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేశాం. రెండు వేల వరకు మెట్రో పిల్లర్లను నిర్మించామని పేర్కొన్నారు. రెండో దశలో విమానాశ్రయానికి అన్ని వైపుల నుంచి మెట్రో కలపాలని సీఎం చెబుతున్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలైన్ను కలుపుతాం. రెండో దశ సర్వే దశలో ఉంది. ఫెజ్-1 పాతబస్తీ మెట్రో మినహా మిగిలినవి ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రకటించారు. మెట్రో పాస్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.