యుఎన్ : భారతదేశానికి రాఫెల్ యుద్ధ విమానాలు విక్రయించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకున్న సమయంలో తాను అధికారంలో లేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ చెప్పారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లి సమావేశాల సందర్శంగా మాక్రోని మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ 2016లో రాఫెల్ డీల్ కుదుర్చుకున్న సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఫ్రాంకోయిస్ హోలాండే అధ్యక్షుడిగా ఉండగా, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మార్కొని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.