ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 15, 2018, 02:27 PM

హుస్నాబాద్‌:  రానున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌లోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు తెచ్చి కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఎన్నికల కమీషన్‌ కఠినంగా వ్యవహరించాలని కోరారు. మహాకూటమిలో రెబల్స్‌ బెడద లేకుండా ఆయా పార్టీలు సమన్వయం చేసుకోవాలని, కింది స్థాయి క్యాడర్‌ పూర్తిగా సహకరించాలని కోరారు. సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడే లీకులు ఇవ్వడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పని చేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రాజిరెడడ్‌, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మంద పవన్‌, ఎడ్ల వెంకట్రాంరెడ్డి, గడిపె మల్లేశ్‌, కొయ్యడ సృజన్‌, కూన శోభారాణి, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com