ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాసరలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 16, 2018, 10:50 AM

బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు సరస్వతి అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచే అమ్మవారికి విశేష పూజలు చేస్తున్నారు. ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు కొనసాగుతున్నాయి. అమ్మవారికి మహా నివేదన మంగళహారతి ఇస్తున్నారు. గోదావరి తీరాన వేదపాఠశాల విద్యార్థులచే దేవి పారాయణం చండీయాగం నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటలక గోదావరికి నక్షత్ర హారతి, నాగహారతి ఇవ్వనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com