కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదే లక్ష ఇళ్లు కట్టిస్తామని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అలాగే మాపార్టీ అధికారంలోకి వచ్చాక పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 6 సిలిండర్లు అందజేస్తామన్నారు. మతఘర్షణలు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని ఒక పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. అన్ని వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. తెరాస ప్రభుత్వం కరీంనగర్ జిల్లా అభివృద్ది కోసం చేసిన కృషి శూన్యమన్నారు. 2014 నాటి తెరాస మేనిఫెస్టో కాగితాలకే పరిమితమైందన్నారు.