ఆటోలో మరిచిపోయిన బ్యాగును డ్రైవర్ నిజాయితీతో తిరిగి అప్పగించాడు. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. బేగంపేటలోని మెథడిస్ట్ కాలనీకి చెందిన పద్మా సుబ్రహ్మణ్యం ఆటో (టీఎస్1యూబీ8234)లో మలక్పేటకు వెళ్లింది. దిగి వెళ్లేటప్పుడు వెంట తెచ్చుకున్న బ్యాగ్ను మరిచిపోయింది. ఆలస్యంగా బ్యాగు విషయం గుర్తుకురాగా వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించింది. కాగా ఆటోలో బ్యాగు ఉండటాన్ని గమనించిన మలక్పేటకు చెందిన ఆటోడ్రైవర్ రాజు.. అందులో ఉన్న చిరునామా ఆధారంగా పంజాగుట్ట పోలీసులకు సమాచారమందించాడు. దీంతో వెంటనే పోలీసులు బాధితురాలు పద్మకు సమాచారం ఇవ్వగా, పోలీసుస్టేషన్కు చేరుకున్న ఆటోడ్రైవర్ రాజు బ్యాగును తిరిగి అప్పగించాడు. బ్యాగులో ల్యాప్టాప్తో పాటు విలువైన మొబైల్ ఫోన్ ఉంది. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ రాజును పోలీసులు అభినందించారు.