హైదరాబాద్: తెలుగువారిని రాష్ట్రపతి, ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్దేనని కాంగ్రెస్ రేవంత్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, కాంగ్రెస్ చరిత్రను కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. మాజీ ప్రధాని నెహ్రూ మరణం తర్వాతే ఇందిర మంత్రి అయ్యారని, దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం కోసమే సోనియా పార్టీ పగ్గాలు తీసుకున్నారని, మన్మోహన్ లాంటి మేధావిని ఆమె ప్రధానిని చేశారని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం సోనియా కుటుంబం పదవులకు దూరంగా ఉందని, దేశ ప్రజలంతా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే కేసీఆర్ను ఓడించాలని మరోసారి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.