ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన బంగారం, వెండి ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 23, 2018, 04:59 PM

అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెత్తడంతో మంగళవారం (అక్టోబరు 23) బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.130 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,350 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,200 గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి రూ.250 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.39,750 వద్ద నిలిచింది. 


అంతర్జాతీయంగాను బంగారం ధరలు పెరిగాయి. సౌదీ అరేబియా, పాశ్యాత్య దేశాల్లో నెలకొన్న రాజకీయ వివాదాలు, ఇటలీ బడ్జెట్‌లోటు, బ్రెక్సిట్‌ చర్చల ఫలితంగా ఔన్సు బంగారం ధర 0.2 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్సు బంగారం ధర $1,223.66 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లలోనూ బంగారం ధరలు 0.2 శాతం మేర పెరిగాయి. దీంతో అమెరికన్ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర $1,226.5 వద్ద స్థిరపడింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com