త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎన్నారైలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ తరపున టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఇవాళ ప్రచారం నిర్వహించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించిన ఎన్నారైలు.. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చైతన్యం కల్పించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న ఎన్నారైలు.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పిస్తూ 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.