కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు ఆయన కొడంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలింగ్ తేదీ లోగా తెరాసకు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని చెప్పారు. కొడంగల్ లో తాను 30 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.