స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ .."స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో ముగ్గురు నాయకులున్నారు. కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు ఈ ముగ్గురు నాయకులు అందుబాటులో ఉంటారు.2014 ఎన్నికలలో నేను ఎంపీగా, రాజయ్య ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ నియోజక వర్గంలో 1,60,000 ఓట్లుంటే, నాకు 1,30,000 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో నాకు ఎంపీగా 90వేల మెజారిటీ వచ్చింది. రాజయ్యకు కూడా ఈసారి 90వేల మెజారిటీ రావాలి.
స్టేషన్ ఘన్పూర్ లో కడియం శ్రీహరి మనుషులు, రాజయ్య మనుషులు, రాజేశ్వర్ రెడ్డి మనుషులు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు, తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నవాళ్లతో చెరువు మత్తడి పోసినట్లుంది. చెరువు మత్తడిపోసినప్పుడు చాపలు జారకుండా చూసుకోవాలి. చాలామంది వలలు పట్టుకుని వస్తున్నారు. డబ్బులు బాగా ఉన్నయని, పంచడానికి వస్తున్నరట. అయితే వాళ్లు వలలో వేసే బిస్కట్లకు ఎవరు చిక్కరని, మనవాళ్లు ఎవరూ వాటికి ఆశపడరని నాకు నమ్మకం ఉంది.