హైదరాబాద్: తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామన్న తెరాస నేతలు నల్లా ఇవ్వకుండానే నామినేషన్లు ఎలా వేశారని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ప్రశ్నించారు. నల్లా నీళ్లు ఎవరికి ఇచ్చారో.. ఎవరిని ఓట్లు అడుగుతారని, తెరాస నేతలకు కానీ, కెసిఆర్ కుటుంబానికి కానీ తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదన్నారు. ప్రజలను మోసం చేసిన ఘనత తెరాస నేతలదేనన్న జగ్గారెడ్డి రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర అప్పు 2.20 లక్షల కోట్లకు చేరుకుందని, ఇంత అప్పు చేసిన ముఖ్యమంత్రి ఈ కోట్లను ఎవరికిచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.