సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సీనియర్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. అంతకుముందు సిరిసిల్లలో మంగళవారం సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మార్పులు చేర్పులపై స్థానిక నేతలకు సూచనలు చేశారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో గులాబీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న విషయం తెలిసిందే.