ఖమ్మం : తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరముందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచార సభలో తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీరందించే ప్రణాళికలు రచించింది కెసిఆరే అని చెప్పారు. రహదారుల నిర్మాణానికి పెద్ద పీట వేశారని, ఖమ్మం జిల్లా ప్రజలు కెసిఆర్ను మరిచిపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.