ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షకు తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు స్టాక్మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో వరుసగా మూడో రోజూ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 10750కి దిగువన ట్రేడింగ్ను ఆరంభించింది. చమురు ఉత్పత్తి, సరఫరాపై చర్చలు జరిపేందుకు ఒపెక్ సమావేశం కానున్న నేపథ్యంలో చమురు సంస్థల షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫలితంగా సూచీలు కుదేలవుతున్నాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 330 పాయింట్లకుపైగా నష్టపోయి 35,549కి చేరగా.. నిఫ్టీ వంద పాయింట్లకుపైగా నష్టంతో 10,681 వద్ద ట్రేడవుతోంది.