హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటలు పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడు ఊపందుకుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఈవో రజత్కుమార్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 15శాతం పోలింగ్ నమోదు అయ్యింది.