1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు పడింది. ప్రత్యేక కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు పక్కనబెట్టింది. సిక్కుల ఊచకోత ఘటనలో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈకేసులో సజ్జన్ కుమార్ ను దోషిగా కోర్టు తేల్చింది. 34 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెల్లడించింది. ఈనెల 31వతేదీలోపు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.