భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడెంలో విషాదం నెలకొంది. తొగ్గుడెం క్వారీలో జరిగిన బ్లాస్టింగ్లో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. గాయాలపాలైన వారిలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన వెంకటేష్, కుమార్ స్వామి, వెంకట్ స్వామి,శశికుమార్ లు ఉన్నారు. చనిపోయిన వ్యక్తి పేరు తెలవాల్సి ఉంది. విషయం బయటకి రాకుండా చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.