ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మహాకూటమికి షాక్ ఇచ్చారు. బీజేడీ మహాఘట్ బంధన్ లో చేరబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలన్న విధానానికే బీజేడీ కట్టుబడి ఉంటుందని ఆయనీ రోజు స్పష్టం చేశారు. బీజేపీకి, కాంగ్రెస్ కు బీజేడీ సమాన దూరం పాటిస్తుందని నవీన్ పట్నాయక్ అన్నారు. దీంతో ఆయన బీజేపీయేతర, కాంగ్రెసేతన ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ నవీన్ పట్నాయక్ తో ఫెడలర్ ఫ్రంట్ పై భేటీ అయిన సంగతి తెలిసిందే.