హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరిన విషయం తెలిసిందే. 11 మండలాలతో నారాయణపేట, 9 మండలాలతో ములుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన రెండు జిల్లాలు నేటి నుంచి మనుగడలోకి వచ్చాయి. ఆవిర్భావ వేడుకలు ములుగు, నారాయణపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు రోనాల్డ్ రోస్, వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.