త్రిపుర : త్రిపుర పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని సీజ్ చేశారు. ధరమ్ నగర్ లో తనిఖీలు నిర్వహించగా..లారీలో రూ.35 లక్షల విలువ చేసే గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఉత్తర త్రిపుర ఎస్పీ చక్రవర్తి తెలిపారు. అగర్తలాకు అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి, లారీని సీజ్ చేశామని ఎస్పీ వెల్లడించారు. త్రిపురలో ఇప్పటివరకు రూ.5 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు త్రిపుర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.