బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను తొలగించాల్సిందేన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్తో తమకు ఎటువంటి సంబంధాలూ అవసరం లేదన్నారు. పుల్వామా ఉగ్రదాడిని నిరసనగా కేసీఆర్ జన్మదిన వేడుకలను రద్దు చేసుకోవడం హర్షణీయమన్న ఆయన.. పాకిస్థాన్ కోడలు సానియా విషయంలో పునరాలోచించాలన్నారు. సానియా మీర్జాను కాకుండా తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు లేది సైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్ నియమించాలని కోరారు.