ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నిజం చేస్తున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 3,610 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా.. అవి వివిధ దశల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలతో ఈ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. తాంసి మండలం బండల నాగాపూర్లో గత ఏడాది ప్రారంభమైన 100 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పేదల కోసం అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించిన ఇండ్లను ఈ రోజు ఎంపీ నగేశ్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ శోభారాణి ప్రారంభించారు. ఎన్నో ఏండ్ల సొంతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.