హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఉదయసింహా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాల్సిందిగా ఉదయసింహాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో కొద్దిసేపటి క్రితమే ఉదయసింహా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా రేవంత్రెడ్డి గత వారం ఈడీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా విచారణకు రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. ఆ గడువు 19వ తేదీకి ముగుస్తుంది. దీంతో రేపు రేవంత్రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశముంది.