ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూత్తుకుడి కర్మాగారం పున:ప్రారంభానికి సుప్రీంకోర్టు నిరాకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 02:33 PM

న్యూఢిల్లి : సుప్రీంకోర్టులో వేదాంత సంస్థకు చుక్కెదురైంది. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్న వేదాంత సంస్థ తన కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించవచ్చునని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. కర్మాగారం తెరవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత సంస్థకు, తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసు విషయంలో మద్రాసు హైకోర్టులో అత్యవసర విచారణ కోరవచ్చునని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com