న్యూఢిల్లి : సుప్రీంకోర్టులో వేదాంత సంస్థకు చుక్కెదురైంది. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ ప్లాంట్ నిర్వహిస్తున్న వేదాంత సంస్థ తన కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించవచ్చునని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. కర్మాగారం తెరవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత సంస్థకు, తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసు విషయంలో మద్రాసు హైకోర్టులో అత్యవసర విచారణ కోరవచ్చునని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.