డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్ శాసనసభలో రెండుసార్లు పడిపోయారు. దాదాపు స్పృహ తప్పినట్లయింది. బడ్జెట్ ప్రసంగం చదువుతూ తూలిపోయి మైక్పైన పడిపోయారు. వెంటనే సహచర ఎమ్మెల్యేలు ఆయనను లేవదీశారు. కొంత కోలుకున్నాకా ఆయన తిరిగి బడ్జెట్ చదవడం ప్రారంభించారు. అయితే చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించారు. ఆయనకు వైద్య సహాయం అందించారు. ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మిగిలిన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా సభ ముగిసే సమయానికి పంత్ కోలుకున్నారు. బడ్జెట్పై మీడియాతో మాట్లాడారు.