ప్రధానిగా నరేంద్ర మోడీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ఢిల్లీ కాంగ్రెస్ వార్ రూమ్లో జరిగిన ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించామని, ఎన్నికల ప్రచారం ఎప్పుడు ప్రారంభించాలనేది ఇంకా నిర్ణయించలేదని విజయశాంతి తెలిపారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో కేసీఆర్పైనే తమ పోరాటం ఉంటుందన్న ఆమె మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా ప్రచారం చేస్తామన్నారు.