బెంగళూరు : స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సిఎ) తేజాస్ యుద్ధ విమానం భారత వైమానిక దళం (ఐఎఎఫ్) లోకి లాంఛనంగా చేరింది. ఉపయోగానికి సిద్ధంగా ఉన్న ఈ విమానానం ఐఎఎఫ్కు అందడంతో నేడు ఎంతో చరిత్రాత్మక దినమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఎయిరో ఇండియా 2019లో మిలిటరీ ఏవియేషన్ రెగ్యులేటర్ సెమిలాక్ ఈ యుద్ధ విమానానికి సంబంధించి తుది కార్యాచరణ క్లియరెన్స్ సర్టిఫికెట్ను చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ బీరేందర్ సింగ్ దనోహాకు అందజేశారు.