ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నారై విభాగం కీలక పాత్ర పోషించాలి : కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 07:14 PM

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం కీలకపాత్ర పోషించాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  పార్టీ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాలకు సూచించారు. 40 దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలను విస్తరించిన సందర్భంగా కేటీఆర్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మహేశ్‌ బిగాల కలిశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై సలహాదారు ఎంపీ కవిత సహాయంతో రెండు సంవత్సరాల కాలంలోనే 40 దేశాల్లో పార్టీని విస్తరించామని ఆయన తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకపాత్ర  పోషించామని, వంద మంది ఎన్నారైలు తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారని వివరించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే వందకుపైగా దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలను విస్తరించి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కేటీఆర్‌ ఆదేశించినట్లు మహేశ్‌ బిగాల తెలిపారు.


 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com