ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 07:48 PM

ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా ఉందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. శంషాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.." నోట్ల రద్దుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతిచ్చారు. నోట్ల రద్దుతో దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులా మారితే కేసీఆర్‌ మాత్రం మంచిపని చేశారని అంటారు. జీఎస్టీ విషయంలో కేసీఆర్‌.. మోదీకి సర్టిఫికెట్‌ ఇచ్చారు. మోదీలాంటి దుర్మార్గాలకు కేసీఆర్‌ మద్దతిస్తున్నారు. రాఫెల్‌ కొనుగోళ్లలో వేలకోట్లు అంబానీకి దోచిపెట్టే యత్నం చేశారు. రాఫెల్‌ వ్యయాన్ని రూ.1600 కోట్లకు పెంచి నష్టం చేకూర్చారు. అంబానీ జీవితంలో ఎప్పుడూ యుద్ధ విమానాల్ని తయారు చేయలేదు. 70 ఏళ్లుగా విమానాలు తయారు చేసిన చరిత్ర హెచ్‌ఏఎల్‌ది. మోదీ తప్పుచేశాడని హిందూ పత్రికలో వచ్చింది. రాఫెల్‌ విషయంలో కేసీఆర్‌ ఎన్నిసార్లు ప్రశ్నించారు?. ఒక్కసారైనా మోదీని కేసీఆర్‌ ప్రశ్నించారా?. మోదీనే ప్రధానిగా కొనసాగాలని కేసీఆర్‌ ఉద్దేశం. మోదీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ ఉంది" అని కేసీఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com