ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశాన్ని రెండుగా విభజించనీయను: రాహుల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 09:00 PM

గత ఐదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ దేశాన్ని రెండు భాగాలుగా విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఒక భాగం ధనికులది, మరో భాగంలో పేదలను చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నా ప్రాణమున్నంత వరకు దేశాన్ని రెండు ముక్కలుగా చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటానని రాహుల్ స్పష్టం చేశారు. 15 మంది పెట్టుబడిదారుల కోసం దేశాన్ని మోదీ రెండు భాగాలు తయారు చేస్తున్నారు. ఈ వర్గం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కట్టకుండా ఉన్న రూ.3.50 లక్షల కోట్లు ప్రధాని మాఫీ చేశారు. నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, విజయ్ మాల్యా బ్యాంకులకు రుణాలు ఎగవేసి దేశాన్ని వదిలి పారిపోయారు. వాళ్లను పట్టుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయడం లేదన్నారు. ఇంకో భాగమైన భారతదేశంలో రుణాలు మాఫీ చేయాలని రైతులు కోరుతున్నాఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాఫీ చేయడం లేదని విమర్శించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అడుగుతుంటే పట్టించుకోకుండా, ప్రధాని మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అని చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.


లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు మిమ్మల్నీ మోసం చేసి పెద్ద నోట్ల రద్దుకు మద్దతు పలికారు. నోట్ల రద్దుతో దేశంలో కోట్లాది మంది నిరద్యోగులుగా మారగా, మంచి పనిచేశారని కేసీఆర్ ఇక్కడ పొగడుతారు. జీఎస్టీ ఐదు రకాల స్లాబ్ లతో అమలు చేస్తే కేసీఆర్ కూడా మద్దతు ఇచ్చారు. లోక్ సభలో, రాజ్యసభలో కూడా నరేంద్ర మోదీ విధానాలకు సంపూర్ణ మద్ధతు పలికారన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ద విమానాల తయారీ హెచ్ఏఎల్ కు అప్పగించిందన్నారు. తమ హయాంలో రూ.526 కోట్ల కు ఒక రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేసేందుకు, ఆ మొత్తాన్ని రూ.1600 కోట్లకు పెంచారని అన్నారు. వాయుసేన పటిష్ఠం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి, దాన్ని లూటీ చేస్తున్నారన్నారు. 


హిందూ జాతీయ దిన పత్రికలో రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో ప్రధాని నరేంద్ర మోదీ తప్పు చేశారని, అనిల్ అంబానికి లాభం చేశారని కథనం రాశారు. రాఫెల్ లో ఎన్ని సార్లు కేసీఆర్ ప్రశ్నించలేదన్నారు. ఒక్కసారి అయినా కేసీఆర్ విమర్శించలేదు. విచారణ చేయాలని డిమాండ్ చేశారా. ఎందుకు అడగడం లేదో చెప్పాలన్నారు. మోదీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా ఉంది. అందుకే ఆయన అవినీతి పై అడగడం లేదు, ప్రశ్నించడం లేదన్నారు. ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రధాని అక్రమాలపై దాడి చేస్తోంది కాని కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదో ప్రశ్నించాలన్నారు. వాళ్లిద్దరి మధ్య స్నేహం ఉంది. 15 మంది పెట్టుబడిదారుల కోసం మోదీ పనిచేస్తున్నారు. మోదీ 15 మంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తే, పేదల పక్షాన కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. చారిత్రాత్మక పనులు చేసి కాంగ్రెస్ అందరినీ ఆదుకున్నది. 2019లో అలాంటి పనులు చేసి పాలిస్తామన్నారు. కనీస ఆదాయ పరిమితి అర్హులందరికీ అందచేస్తాను. ఈ పథకం అమలు కోసం ఎంతదాక అయినా వెళ్తాను. నరేంద్ర మోదీ నీరవ్ మోదీ ఖాతాల వేస్తారు, కాని నేను పేదల ఖాతాలో వేస్తాను. దేశం నుంచి పారిపోయిన వారిని వెనక్కి రప్పించి, ఆ డబ్బులు ప్రజలకు పంపిణీ చేస్తాను అని తెలిపారు.


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com