కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విటర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘రిమోట్ కంట్రోలింగ్ ప్రధానులు, ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పేటెంట్ అని దేశంలోని అందరికి తెలుసు. అంతేకాదు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాలపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నాయి.. కానీ తమ రిమోట్, భవిష్యత్ మాత్రం తెలంగాణ ప్రజలే’ అని రాహుల్ ట్వీట్కు రీట్వీట్ చేశారు కేటీఆర్. శంషాబాద్లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ టీఆర్ఎస్పై మాటల తూటాలు పేల్చారు. నరేంద్ర మోదీ రిమోట్తో కేసీఆర్ను కంట్రోల్ చేస్తున్నారంటూ తన ట్విటర్లో విమర్శించారు. అందుకు సమాధానం ఇచ్చారు కేటీఆర్. లోక్సభ ఎన్నికలకు నెలరోజులే సమయం వుండటంతో నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ సభల్లోనూ, ఇలా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారని అంటున్నారు.